Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో ఆ ఐదు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు.. మందులు సిద్ధం

దేశంలో ఆ ఐదు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు.. మందులు సిద్ధం
, బుధవారం, 26 మే 2021 (20:14 IST)
భారతదేశం సెకండ్ వేవ్ కరోనాతో పోరాడుతుండగా.. మరో‌వైపు కొత్త ఫంగస్‌లు టెన్షన్ పెడుతూ ఉన్నాయి. దేశంలో ఐదు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్య ప్రదేశ్ ఉన్నాయి. గుజరాత్‌లో 2,859 కేసులు, మహారాష్ట్రలో 2,770, ఏపీలో 768 కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా 11,717 కేసులు నమోదయ్యాయి.
 
బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు కోరుతున్నట్లుగా బ్లాక్ ఫంగస్ చికిత్సలో వినియోగించే మందులను ప్రాధాన్యతాక్రమంలో కేటాయించింది.

మ్యూకోర్మైకోసిస్ చికిత్సలో ఉపయోగించే యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లను రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అందించింది. మహారాష్ట్ర, ఢిల్లీ, యుపీ, ఏపీ లలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సదరు రాష్ట్రాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పెరుగుతున్నాయి. 
 
భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పలు రాష్ట్రాలు యాంఫోటెరిసిన్-బీ ఇంజెక్షన్లను కేటాయించాలంటూ కేంద్రాన్ని కోరాయి. 29వేల 250 యాంఫోటెరిసిన్-బి వయల్స్ పలు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా కేటాయిస్తూ మే 26న ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ దాడి చేసినా యుద్ధ ట్యాంకులు రాష్ట్రాలే కొనుక్కోవాలా? కేజ్రీవాల్