Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14 ఏళ్ల బాలికపై 40 మంది గ్యాంగ్ రేప్.. రాత్రిపూట మత్తుమందిచ్చి..?

ఆసియా దేశాల్లో ఒకటైన థాయ్‌లాండ్‌లో ఘోరం జరిగింది. 14 ఏళ్ల బాలిక కామాంధుల చేతుల్లో నలిగిపోయింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 40 మంది పురుషులు ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. థాయ్‌లాండ్‌లోని పంగ్

Advertiesment
Thailand
, మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (14:53 IST)
ఆసియా దేశాల్లో ఒకటైన థాయ్‌లాండ్‌లో ఘోరం జరిగింది. 14 ఏళ్ల బాలిక కామాంధుల చేతుల్లో నలిగిపోయింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 40 మంది పురుషులు ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. థాయ్‌లాండ్‌లోని పంగ్ ఎన్‌గా ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. బాధితురాలి తల్లిదండ్రులు కూలి కార్మికులు. రాత్రిపూట పనులకు వెళ్ళిపోతారు. చిన్నారి మాత్రమే ఇంట్లో ఒంటరిగా వుండేది. ఆ సమయంలో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన ఓ వ్యక్తి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
 
అదే వ్యక్తి వేరొక రోజున చిన్నారిపై అత్యాచారం పాల్పడేందుకు తన స్నేహితులను తీసుకొచ్చాడు. వారందరూ కలిసి చిన్నారికి మత్తుమందిచ్చి అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని బయటికి చెప్తే చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో తల్లిదండ్రుల వద్ద ఈ విషయాన్ని బాధిత బాలిక దాచేసింది. ఇలా రోజు రోజుకీ చిన్నారిపై అత్యాచారం చేసేందుకు ఓ బృందం వచ్చి వెళ్లేది. గత ఏడాది మే నుంచి డిసెంబర్ వరకు ఈ ఘోరం జరిగింది. 
 
ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో విచారణ జరపాల్సిందిగా సదరు  రాష్ట్ర పోలీసులకు గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ లైంగిక దాడిని అడ్డుకోవడానికి బాధితురాలే.. తల్లితో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైల్వే పార్శిల్ ఆఫీసులో యువతితో హెడ్ క్లర్క్ రాసలీలలు..