Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేరళలో ర్యాగింగ్ భూతం.. టాయిలెట్లు కడిగించి.. మురుగునీరు తాగించారు..

ర్యాంగింగ్ భూతం అక్కడక్కడా పంజా విసురుతూనే ఉంది. ర్యాంగింగ్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఎందరో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన నేపథ్యంలో కేరళలో దారుణమైన ర్యాంగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోక

కేరళలో ర్యాగింగ్ భూతం.. టాయిలెట్లు కడిగించి.. మురుగునీరు తాగించారు..
, బుధవారం, 21 డిశెంబరు 2016 (16:24 IST)
ర్యాంగింగ్ భూతం అక్కడక్కడా పంజా విసురుతూనే ఉంది. ర్యాంగింగ్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఎందరో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన నేపథ్యంలో కేరళలో దారుణమైన ర్యాంగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. కేరళలోని మలప్పురం జిల్లా మంజేరిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సీనియర్ విద్యార్థులు జూనియర్లపై అమానుషంగా ప్రవర్తించారు. పైశాచికంగా జూనియర్ విద్యార్థులతో మురుగునీరు తాగించారు. 
 
జూనియర్ విద్యార్థులతో టాయిలెట్లు కడిగించడంతో పాటు మురుగునీటిని తాగించారు. కొట్టాయంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ర్యాగింగ్‌కు పాల్పడిన సంఘటనలో విద్యార్థి మూత్ర పిండాలు దెబ్బతిన్నాయి. దీంతో, అతనికి డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో ఐదుగురు నిందితులు లొంగిపోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. 
 
ఈ దారుణంపై సుమారు 40 మంది జూనియర్ విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి బుధవారం ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ర్యాంగింగ్‌పై స్పందించిన యాజమాన్యం 21 మంది సీనియర్లను సస్పెండ్ చేసింది. అంతేగాకుండా ఘటనపై దర్యాప్తుకనకు ఓ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ హితబోధ నాక్కాదు... తెలివితక్కువగా నోట్ల రద్దు చేసినవాళ్లకి చెప్పండి... పవన్ ఫైర్