Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెన్నైలో దారుణం.. మద్యం తాగించి కారులో సామూహిక అత్యాచారం

gang rape
, గురువారం, 30 జూన్ 2022 (19:58 IST)
చెన్నైలో దారుణం జరిగింది. చెన్నై నగర శివార్లలో ఓ యువతి(20) సామూహిక అత్యాచారానికి గురైంది. యువతిని బెదిరించి, మద్యం తాగించి రేప్ చేశారు కీచకులు. ఈ ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులు పరారయ్యారు. నిందితుల్లో ఒకడు న్యాయవాది, మరొకడు బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
 
వివరాల్లోకి వెళితే.. చెంగల్‌పట్టుకి చెందిన యువతి ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. స్థానికంగా ఉండే శరవణన్‌ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఎప్పటిలానే విధులు ముగించుకొని యువతి ఇంటికి వెళ్తుండగా దారిలో ఆమెకు కారులో వెళ్తున్న శరవణన్ కనిపించాడు. తన కారులో ఇంటి దగ్గర దిగబెడతానని శరవణన్ చెప్పాడు. ఫ్రెండ్ కావడంతో ఆమె అతడిని నమ్మి కారు ఎక్కింది. యువతిని తన కారులో తీసుకెళ్లిన శరవణన్.. కారులో బలవంతంగా ఆమెతో మద్యం తాగించాడు.
 
 కారులో ఉన్న తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత యువతిని రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. తీవ్ర గాయాలతో పడున్న యువతిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉద్ధవ్ థాక్రే సీఎం పోస్టు ఊడిపోవడానికి హనుమంతుడు కారణమా?