Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మధ్యప్రదేశ్‌లో కూలిపోయిన ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ విమానాలు

Indian Air Force
శనివారం, 28 జనవరి 2023 (13:07 IST)
Indian Air Force
ఐఏఎఫ్‌కి చెందిన సుఖోయ్‌-30, మిరాజ్‌-2000 జెట్‌లు మధ్యప్రదేశ్‌లో కూలిపోయాయి. ఈ సంఘటనను ధృవీకరిస్తూ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, త్వరితగతిన సహాయక చర్యలు పూర్తి చేస్తామన్నారు. 
 
ఇందుకోసం వైమానిక దళానికి చెందిన అధికారులు సహకరించాలని ఆదేశించినట్లు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి సుఖోయ్-30, మిరాజ్-2000 విమానాలు ఆకాశంలో ఎగురుతుండగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
భారత వైమానిక దళానికి చెందిన ఈ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు సుఖోయ్-30, మిరాజ్-2000 శనివారం కూలిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
 
మోరెనా అదనపు పోలీసు సూపరింటెండెంట్ రాయ్ సింగ్ నర్వారియా మాట్లాడుతూ, విమానంతో పాటు అందులో ఉన్న వ్యక్తుల సంఖ్య గురించి నిర్ధారించడానికి వైమానిక దళం బృందం సంఘటనా స్థలానికి చేరుకుంటుందని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగనన్న గోరుముద్ద వికటించి.. 36మంది విద్యార్థుల అస్వస్థత