Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అత్యాచారం చేసి... భవనంపై నుంచి కిందికి తోసేశారు...

అత్యాచారం చేసి... భవనంపై నుంచి కిందికి తోసేశారు...
, శుక్రవారం, 11 డిశెంబరు 2020 (20:31 IST)
గుజరాత్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ యువతిపై అత్యాచారం చేసిన దుండగులు ఆమెను భవనం నుంచి కిందికి తోసేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరం, పార్లే పాయింట్ ఏరియాలో ఓ 18 యేళ్ళ యువతిపై కొందరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండేందుకు బాధితురాలిని భవనం నుంచి కిందికి తీసేశారు.
 
దాంతో బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాల మ‌ధ్య‌గా ఉన్న రోడ్డుపై ఆ యువ‌తి ప‌డిపోయింది. తీవ్ర గాయాల‌తో అప‌స్మార‌క స్థితిలో ప‌డివున్న యువ‌తిని చూసి స్థానికులు పోలీసులకు స‌మాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని యువ‌తిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.
 
ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. గురువారం ఉద‌యం ఆప‌స్మార‌క స్థితిలో ఉన్న యువ‌తిని ఆస్ప‌త్రి చేర్చామ‌ని, అదేరోజు సాయంత్రానికి ఆమె స్పృహ‌లోకి వ‌చ్చింద‌ని పోలీసులు చెప్పారు. 
 
అయితే నిందితుడు ఎవ‌ర‌నే విష‌యాన్ని బాధితురాలి చెప్ప‌లేక‌పోతున్న‌దని, తాము ప్ర‌స్తుతం నిందితుడిని గుర్తించే ప‌నిలో ఉన్నామ‌ని తెలిపారు. నిందితుడు ప‌ట్టుబ‌డితే కేసు చిక్కుముడి వీడే అవకాశం ఉంద‌న్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్ ‌160 కోసం ప్రీ బుకింగ్‌ తెరిచిన పియాజ్జియో ఇండియా