Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జైపూర్‌లో 16ఏళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారం.. సిగరెట్‌తో కాల్చారు..

మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. జైపూర్‌లో ఓ పదహారేళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగింది. పని మనిషి అయిన ఆ అమ్మాయిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

జైపూర్‌లో 16ఏళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారం.. సిగరెట్‌తో కాల్చారు..
, మంగళవారం, 29 నవంబరు 2016 (09:30 IST)
మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. జైపూర్‌లో ఓ పదహారేళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగింది. పని మనిషి అయిన ఆ అమ్మాయిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
వివరాల్లోకి వెళితే, బాధితురాలు పశ్చిమ బెంగాల్‌కు చెందిన అమ్మాయి. ఆదివారంనాడు తనపై జరిగిన అత్యాచారంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల్లో ఒకరిని బిల్లుగా గుర్తించినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముఖేష్ చౌదరి చెప్పారు. 
 
తనపై అత్యాచారం జరిగిందని.. ఇందుకు ప్రతిఘటించిన కారణంగా.. సిగరెట్‌తో కాల్చినట్లు బాధితురాలు తెలిపింది. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోడీని రాజకీయాల నుంచి తరిమికొడతా: మమతా బెనర్జీ భీష్మ ప్రతిజ్ఞ