Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోడీని రాజకీయాల నుంచి తరిమికొడతా: మమతా బెనర్జీ భీష్మ ప్రతిజ్ఞ

మహాభారతంలో భీష్ముడు చేసిన ప్రతిజ్ఞలా పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ప్రతిజ్ఞ చేశారు. పెద్ద నోట్ల రద్దుపై మొదటి నుంచి విమర్శలు కురిపిస్తున్న మమత.. మోడీపై తీవ్ర

మోడీని రాజకీయాల నుంచి తరిమికొడతా: మమతా బెనర్జీ భీష్మ ప్రతిజ్ఞ
, మంగళవారం, 29 నవంబరు 2016 (09:24 IST)
మహాభారతంలో భీష్ముడు చేసిన ప్రతిజ్ఞలా పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ప్రతిజ్ఞ చేశారు. పెద్ద నోట్ల రద్దుపై మొదటి నుంచి విమర్శలు కురిపిస్తున్న మమత.. మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను మరణించాల్సి వచ్చినా సరే, మోడీని మాత్రం దేశ రాజకీయాల నుంచి తరిమికొడతానని తీవ్రస్వరంతో ప్రతిజ్ఞ చేశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే, మోడీని గద్దె నుంచి దించేస్తానని హెచ్చరించారు. దానికోసం జైలుకు పోవడానికైనా, ప్రధాని ఇంటి ముందు బైఠాయించడానికైనా సిద్ధమేనని సవాల్‌ విసిరారు. 
 
దేశాన్ని నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా నడిపించడం గురించి నరేంద్ర మోడీ ఉపన్యాసాలు దంచుతున్నారని మమత మండిపడ్డారు. ఆకలితో ఉన్న జనం క్రెడిట్‌, డెబిట్‌ కార్డులను తినాలా అని ప్రశ్నించారు. కేంద్రం విధించిన అప్రకటిత ఆర్థిక ఎమర్జెన్సీ తొలగిపోయేదాకా విశ్రమించను. తనను వ్యతిరేకించే వారి పైకి మోడీ సీబీఐ, ఈడీ, ఐటీని ఉసిగొల్చి, అణచేయాలని చూస్తున్నారు. 
 
కానీ తను ఎవ్వరూ అణచలేరని మమత బెనర్జీ తెలిపారు. మళ్లీ ఢిల్లీ వెళ్లి, నిరసన ప్రదర్శన నిర్వహిస్తానని వెల్లడించారు. కాగా, భారత బంద్‌ వల్ల సామాన్యుల కష్టాలు పెరగడం తప్ప, ప్రయోజనం శూన్యమని మమత అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్.. మంగళసూత్రాన్ని తెంపేశాడు..