Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సుప్రీంకోర్టును కుదిపేస్తున్న కరోనా.. 15 మంది జడ్జీలకు పాజిటివ్

సుప్రీంకోర్టును కుదిపేస్తున్న కరోనా.. 15 మంది జడ్జీలకు పాజిటివ్
, గురువారం, 22 ఏప్రియల్ 2021 (15:45 IST)
సుప్రీంకోర్టులో 15 మంది న్యాయమూర్తులకు కరోనా సోకినట్లు తేలింది. అందులో ఒకరు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. తమ సిబ్బందికి కరోనా వచ్చిందని ముగ్గురు న్యాయమూర్తులు వెల్లడించారు. కరోనా రెండో దశ వ్యాప్తి సుప్రీంకోర్టును కుదిపేస్తోంది. ఇప్పటికే వైరస్ ప్రభావం కేసుల విచారణపై పడింది. 
 
తాజాగా.. సుప్రీంకోర్టులో 15 మంది న్యాయమూర్తులకు కరోనా సోకినట్లు తేలింది. అందులో ఒకరు ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అదేసమయంలో, తమ సిబ్బందికి కరోనా సోకిందని.. న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సూర్యకాంత్​లు వెల్లడించారు. 
 
పరిమిత కేసులు.. వర్చువల్ వాదనలు
తొలి దశలో కరోనా వ్యాప్తి సందర్భంగా సుప్రీంలో ఎటువంటి పరిస్థితి ఉండేదో.. ప్రస్తుతం అదే విధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. న్యాయమూర్తులు తమ స్వస్థలాల నుంచే వర్చువల్​గా వాదనలు వింటున్నారు. ఇప్పుడు.. 11 న్యాయమూర్తులతో కూడిన నాలుగు బెంచీలు వాదనలు ఆలకిస్తున్నాయి. పరిమితమైన కేసులను మాత్రమే విచారిస్తున్నారు.
 
సుప్రీంలోని న్యాయమూర్తులందరికీ నెల క్రితమే వ్యాక్సిన్ అందించారు. న్యాయవాదులు, సిబ్బందికి టీకా ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. లక్షణాలు ఉన్నవారికి ఆర్​టీ - పీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేసింది న్యాయస్థానం. కరోనా​ లక్షణాలు కనిపిస్తే కోర్టుకు రావొద్దని సూచించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా ఆస్పత్రి ఫుల్.. పడకల్లేవ్.. ఇక్కడకు రావొద్దు