Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

12ఏళ్ల బాలికపై ప్రిన్స్‌పాల్‌తో పాటు ముగ్గురు ఉపాధ్యాయుల గ్యాంగ్ రేప్.. స్కూల్ భవనంపైకి తీసుకెళ్లి?

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే కీచక పర్వానికి తెరలేపారు. ఓ 12 ఏళ్ల బాలికపై పాఠశాల ప్రిన్సిపాల్, ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బీహార్‌లోని జెహానాబాద్‌లో ఆదివారం

Advertiesment
12ఏళ్ల  బాలికపై ప్రిన్స్‌పాల్‌తో పాటు ముగ్గురు ఉపాధ్యాయుల గ్యాంగ్ రేప్.. స్కూల్ భవనంపైకి తీసుకెళ్లి?
, మంగళవారం, 17 జనవరి 2017 (14:43 IST)
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే కీచక పర్వానికి తెరలేపారు. ఓ 12 ఏళ్ల బాలికపై పాఠశాల ప్రిన్సిపాల్, ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బీహార్‌లోని జెహానాబాద్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పాఠశాల భవనంలో ఒంటరిగా ఉన్న బాలికపై కాకోసెకండరీ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ అజూ అహ్మద్‌తోపాటు అతుల్‌ రహ్మాన్, అబ్దుల్‌ బరీ, ఎం.డి.శాకౌత్‌లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు
 
ఒంటరిగా ఉన్న బాలికను భవనంపైకి తీసికెళ్లి అక్కడ లైంగికదాడికి పాల్పడ్డారని.. అక్కడ అచేతన స్థితిలో ఉన్న బాలికను అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న బాధితురాలి తల్లి గమనించింది. జరిగిన విషయాన్ని బాధితురాలు తన తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశామని.. నిందితులను అరెస్ట్ చేసేందుకు సత్వర చర్యలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరల్డ్ మోస్ట్ పాపులర్ పాస్‌వర్డ్ ఏంటో తెలుసా?