మావోయిస్టుల మెరుపుదాడి.. 11 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృత్యువాత
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోమారు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఫలితంగా ప్రాథమిక సమాచారం మేరకు 11 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృత్యువాతపడ్డారు. ఈ దాడి సోమవారం మధ్యాహ్నం సుకుమాలో జరిగింది.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోమారు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఫలితంగా ప్రాథమిక సమాచారం మేరకు 11 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృత్యువాతపడ్డారు. ఈ దాడి సోమవారం మధ్యాహ్నం సుకుమాలో జరిగింది.
సుకుమాలో మావోయిస్టుల సమాచారం ఉన్నట్టు సమాచారం అందడంతో సీఆర్పీఎఫ్ బలగాలు గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. దీన్ని అదునుగా భావించిన మావోలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తోన్న 11 మంది సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులు జరిపగా, వారంతా అక్కడిక్కడే చనిపోయారు.
సీఆర్పీఎఫ్ జవాన్ల మృతిని బస్తర్ డీఐజీ సుందర్ రాజు దృవీకరించారు. మరోవైపు బుర్కాపాల్-చింతాగుఫా ప్రాంతంలో ఏడుగురు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయని, వారికి ఆసుపత్రిలో చికిత్స అందుతుందని చెప్పారు.