Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాబా రాందేవ్‌కు ఆదాయపన్ను శాఖ నోటీసులు

Advertiesment
బాబా రాందేవ్
FILE
దేశంలో నల్లధనాన్ని వెలికిదీయాలని ఉద్యమిస్తున్న రాందేవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రస్ట్‌లు, సంస్థలు తయారు చేసిన ఆయుర్వేద ఔషధాలను దేశ, విదేశాల్లో విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఆయుర్వేద ఔషధాలను విక్రయించడం ద్వారా వాణిజ్య కార్యకలాపాలకు పాల్పడ్డాయన్న ఆరోపణతో యోగాగురు బాబా రాందేవ్ నిర్వహిస్తున్న ట్రస్ట్‌లకు ఆదాయపన్ను మినహాయింపు రద్దయింది.

అంతేకాకుండా, రూ.58 కోట్ల పన్ను చెల్లించాలని ఆదాయపన్నుశాఖ నోటీసులు కూడా జారీ చేసింది. 2009-10 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పతంజలి యోగపీఠ్, దివ్యయోగ మందిర్ ట్రస్ట్, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్‌లకు చెందిన రూ.120 కోట్లు ఆదాయాన్ని వాణిజ్యపరమైనదిగా ఆదాయపన్ను శాఖ భావించింది.

Share this Story:

Follow Webdunia telugu