Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శరదృతువు మాయాజాలంతో బంగారు స్వర్గంగా మారిన కాశ్మీర్‌

Advertiesment
Tree

ఐవీఆర్

, శనివారం, 8 నవంబరు 2025 (18:59 IST)
కాశ్మీర్‌లో శరదృతువు వచ్చేసరికి, లోయ బంగారం- ఎరుపు రంగుల సమ్మేళనంగా మారుతుంది. చెట్ల నుంచి రాలిన ఆకులు ప్రకృతి స్వంత కళాఖండంలా నేలను మార్చుతూ వుంటాయి. శ్రీనగర్‌లో, క్రిసాన్తిమం గార్డెన్, కాశ్మీర్ విశ్వవిద్యాలయంలోని నసీమ్ బాగ్, నిషాత్ శ్రీనగర్ గార్డెన్, షాలిమార్ గార్డెన్ అన్నిచోట్ల చెట్ల ఆకులు రాలడంతో పాటు పండిపోయిన ఆకులపై సూర్యర్శి పడి బంగారు వర్ణాన్ని సంతరించుకుంటాయి.
 
నగరం అంతటా తోటలు ప్రతిరోజూ వందలాది మంది సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. ఫోటోగ్రాఫర్‌లు పరిపూర్ణమైన షాట్ల కోసం ఎదురుచూస్తూ కనబడుతున్నారు. రాలిపోతున్న పోప్లర్ ఆకులు కాశ్మీర్ క్లాసిక్ శరదృతువు సీజన్‌కు ఒక ప్రత్యేక ఆకర్షణను జోడిస్తాయి. ఆకులు నెమ్మదిగా రాలిపోవడం, పరిసరాలను బంగారు- ఎరుపుగా మార్చడం చూడటం చాలా అందంగా ఉందని పర్యాటకులు చెబుతున్నారు.
 
బాదంవారీ మరియు ఇతర ఉద్యానవనాలతో పాటు, కాశ్మీర్ విశ్వవిద్యాలయంలోని నసీమ్ బాగ్ సమీపంలోని బంగారు అవెన్యూలు కూడా సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. పర్యాటకులు, విద్యార్థులు, స్థానిక కుటుంబాలు ఛాయాచిత్రాలకు పోజులివ్వడం చూడవచ్చు. అక్టోబర్ ముగిసి నవంబర్ ప్రారంభం కాగానే, లోయ క్రమంగా శీతాకాల ప్రశాంతతకు సిద్ధమవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీకి చాలా అవార్డులు వస్తాయి - బీవీఎస్ రవి