Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్‌కు "పర్యావరణ పరిరక్షణ" అవార్డు

భారత్‌కు
అమెరికాలోని ప్రముఖ పర్యావరణ సంస్థ అందజేసే అవార్డును 2009 సంవత్సరానికిగానూ భారతదేశం చేజిక్కించుకుంది. రాజస్థాన్‌లోని బేర్‌ఫుట్ కాలేజీ, హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి లోయల పరిరక్షణకుగానూ సంయుక్తంగా ఈ అవార్డును అమెరికాలోని "సెరియో క్లబ్" సంస్థ ప్రకటించింది.

బేర్‌ఫుట్ కాలేజీలో గ్రామీణ పౌరులకు, మహిళలకు బేర్‌ఫుట్ సోలార్ ఇంజనీర్లుగా శిక్షణ ఇస్తున్నందుకు, స్పితి లోయ పరిరక్షణకుగానూ సంయుక్తంగా ఈ అవార్డును సెరియో క్లబ్ సంస్థ అందజేయనుంది. ఈ అవార్డు కింద 20 లక్షల రూపాయలను అందజేయనున్నారు. కాగా ఈ అవార్డును జూలై 30వ తేదీన ముంబై నగరంలో ప్రదానం చేయనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu