నల్లమల అభయారణ్యంలో ఒక నక్కల జంట.. వాటి పిల్లలతో కలిసి ఆనందంగా జీవనం సాగిస్తున్నాయి. అదే అడవిలో జంతువులన్నింటికీ రాజు అయిన సింహం కూడా నివసిస్తుండేది. సింహం కొండ గుహలో ఉంటూ ప్రతిరోజూ ఏదో ఒక జంతువును చంపి తెచ్చుకుని తింటూ ఉండేది. దాంతో సింహం అంటేనే ఆ అడవిలోని చిన్నా పెద్దా జంతువులన్నింటికీ హడల్.ఒకరోజు భోరున వర్షం కురుస్తూ ఉంటుంది. బయట వర్షం కురుస్తుంటే లోపల గుహలో వెచ్చగా పడుకుని ఉంటుంది సింహం. పాపం నక్కల జంట, వాటి పిల్లలూ వర్షంలో తడుస్తూ, చలికి వణుకుతూ ఒక చెట్టుకింద కూర్చుని ఉంటాయి. చూస్తే వర్షం తగ్గేలా లేదు.. దగ్గర్లో ఎక్కడా గుహలూ లేవు. ఏం చేయాలి భగవంతుడా అనుకుంటూ ఆడనక్క విచారంలో మునిగిపోయింది.ఇంతలో చలికి తట్టుకోలేని మగ నక్కకు ఒక మెరుపులాంటి ఆలోచన వస్తుంది. వెంటనే భార్యను పిలిచి.. "దగ్గర్లోని గుహలో సింహం ఉంది కదా.. అది రేపు వేటకు వెళ్ళగానే, ఆ గుహలోకి వెళ్లి తలదాచుకుందాం. మళ్లీ అది వచ్చే సమయానికి బయటపడదామని" చెప్పింది. "వద్దు బావా.. ఆ సింహానికిగానీ దొరికితే ఇంకేమయినా ఉందా..? మనతోపాటు పిల్లల్ని కూడా చంపి తినేస్తుంది.." అంటూ భయపడింది ఆడనక్క.సింహాన్ని తెచ్చావా కోతిబావా..!
సింహాన్ని తోడుకొచ్చిన కోతి చూసిన నక్కలు "కోతిబావా.. పొద్దుననగా సింహాన్ని తీసుకొస్తానని చెప్పి, ఇప్పుడా రావటం.." అంటూ అరిచాయి. వెంటనే బూరెలతో భయంకరంగా శబ్దం చేయసాగాయి. కోతి సింహానికి ఎంత నచ్చజెప్పినా వినకపోవటంతో, అక్కడ్నించి...
"
నేను చెప్పినట్లు వింటే మరేం భయం లేదు. ఈ గుహలోనే మనం ఉండొచ్చు"నంటూ ఒక ఉపాయం చెప్పింది మగ నక్క. దాంతో చేసేదేమీ లేక సరేనని తలాడించింది ఆడనక్క. ఈలోగా నాలుగు కొమ్ము బూరలను సంపాందించింది మగనక్క. తెల్లారిపోయినా వర్షం మాత్రం తగ్గలేదు. నక్కబావ భార్యాపిల్లలతో కలిసి నక్కి నక్కి గుహ దగ్గర ఉండే పొదలచాటుగా దాక్కుంది. ఇంతలో సింహం నిద్రలేని అడవికి వేటకు వెళ్లిపోయింది. వెంటనే నక్కల జంట, పిల్లలు సంతోషంగా గుహలోకి దూరాయి.వేటకు వెళ్లిన సింహానికి ఆరోజు వర్షం ఎక్కువగా కురుస్తుండటంవల్ల జంతువులేమీ దొరకలేదు. సింహం రాకను గమనించిన నక్క కొమ్ము బూరలు గట్టిగా పట్టుకుని నోట్లో పెట్టి ఊదటం మొదలెట్టింది. వెంటనే నక్కలు గట్టిగా అరవటం మొదలుపెట్టాయి. తానుండే గుహలోంచి భయంకరమైన శబ్దం రావటం గమనించిన సింహం గుహ వద్ద నిలబడి లోపల ఏం జరుగుతుందో చూస్తే కనిపించలేదు, ఏదైనా వినిపిస్తుందేమోనని అక్కడే ఆగింది.
"ఇప్పటిదాకా వంద సింహాలను బలిచ్చాను ఇంకొక్క సింహం మాత్రమే మిగిలింది. దాన్ని కూడా బలిస్తే నా వ్రతం పూర్తవుతుంది" అని అరవటం.. వెంటనే కొమ్ము బూరల శబ్దం భయంకరంగా వినిపించింది సింహానికి. ఆ శబ్దానికి జడుసుకున్న సింహం.. పెద్ద జంతువేదో నా గుహలో దాగుందని భయపడి పరుగులంకించుకుంది.
పరుగెట్టి.. పరుగెట్టి.. ఆయాసంతో ఓచోట కూలబడింది సింహం. ఇదంతా గమనించిన కోతి.. నక్కలు చేసిన మోసాన్ని గ్రహించి సింహం వద్దకు వెళ్లింది. "మృగరాజా.. అవి వేరే జంతువులు కాదు. నక్కలే, నువ్వు వాటికి భయపడాల్సిన పనిలేదు. పదా నీ గుహలోకి నువ్వెళ్దువుగానీ..!" అని నచ్చజెప్పింది. సింహాన్ని తోడుకొచ్చిన కోతి చూసిన నక్కలు "కోతిబావా.. పొద్దుననగా సింహాన్ని తీసుకొస్తానని చెప్పి, ఇప్పుడా రావటం.." అంటూ అరిచాయి. వెంటనే బూరెలతో భయంకరంగా శబ్దం చేయసాగాయి. కోతి సింహానికి ఎంత నచ్చజెప్పినా వినకపోవటంతో... అక్కడ్నించి వెళ్లిపోయింది.
దీన్నంతా చాటుగా గమనించిన తోడేలు.. "ఈ అడవికి రాజువైన నిన్ను ఇబ్బంది పెడుతున్న ఆ పిచ్చినక్కలకి భయపడటమా..? నాతోరా అవి నక్కలని రుజువు చేస్తాన"ని లాక్కెళ్లింది. "నన్ను అక్కడికి లాక్కెళ్లి నువ్వు పారిపోతే ఎట్లా.. నీ తోకకి నా తోకను ముడేసుకో అప్పుడే వస్తానని" అంది సింహం. సరేనని తన తోకకు, సింహం తోకను ముడేసుకుని గుహవద్దకు బయల్దేరింది తోడేలు.
తోడేలును గమనించిన నక్కలు.. "రా తోడేలు బావా.. సింహాన్ని బలికి తీసుకొస్తానని చెప్పి, మాట నిలబెట్టుకున్నావు. నీకు మంచి బహుమతి ఇస్తాన్లే..!" అంటూ భయంకరంగా బూరలు ఊదసాగాయి. అది విన్న సింహం భయంతో పరుగులంకించుకుంది. తోడేలు తోక తన తోకకు ఉండటంతో దాన్ని కూడా లాక్కెళ్లింది. పరుగెట్టి.. పరుగెట్టి ఒక గోతిలో పడి ప్రాణాలు పోగొట్టుకుంది సింహం. దాంతోపాటు తోడేలు కూడా చచ్చిపోయింది. నక్కలు సంతోషంతో పండుగ చేసుకున్నాయి.