కప్పలు భూకంపాల ఉనికిని పసిగడతాయట.
, శుక్రవారం, 25 నవంబరు 2011 (15:25 IST)
కుక్కలు, ఎలుకలు, కోళ్లు మొదలైన జంతువులు భూకంపాల రాకను గుర్తిస్తాయి అని చాలా సార్లు రుజువైంది. అయితే కప్పలు కూడా ముందు గానే పసిగడతాయని ఇటీవల జరిగిన అధ్యయనంలో తేలింది. 'జర్నల్ ఆఫ్ జువాలజీ'లో ఇటీవల కాలంలో ప్రచురించిన అధ్యయన వివరాలో గత సంవత్సరం ఇటలీలో లాక్విలాలో భూకంపం సంభవించింది. ఈ భూకంపానికి మూడురోజుల ముందే కొన్ని కప్పలు అవి కలుసుకొనే ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయాయి.ఆ కప్పలు కలుసుకొనే చోటుకి భూకంపం సంభవించిన ప్రాంతం 74 కి.మీ దూరంలో ఉంది. ఆ తర్వాత పదిరోజులకు గానీ ఆ కప్పలు వెనక్కు తిరిగి రాలేదు. ఈ సంగతిని రాచెల్ గ్రాంట్ అనే జీవ శాస్త్రవేత్త చెప్పారు. రాచెల్ గ్రాంట్ కప్పల ప్రవర్తన, ప్రత్యుత్పత్తిపై చంద్రుని ప్రభావం గురించి ప్రయోగాలు చేస్తున్నారు.దానికోసం ఒక ప్రాంతంలోని కప్పల్ని ప్రతిరోజూ రాచెల్ గమనిస్తున్నారు. భూకంపం సంభవించే ముందు మూడు రోజులు అవి రాకపోవటాన్ని గమనించారు. ఈ పరిశోధన జంతువులు భూకంపాలను ముందుగానే పసిగడతాయనే వాదనకు బలాన్ని ఇచ్చింది. అయితే కొంతమంది అమెరికన్ శాస్త్రవేత్తలు మాత్రం ఈ వాదనలను అంగీకరించడం లేదు.