రాముడొకడు పుట్టి రవికుల మీడేర్చె
కురుపతి జనియించి కులము జెఱచె
ఇలను బుణ్యపాప మీలాగు గాదొకో
విశ్వదాభిరామ.. వినుర వేమ...!
తాత్పర్యం :
శ్రీరాముని పుట్టుకతో రఘువంశం ఎంతో కీర్తి ప్రతిష్టలను సంపాదించుకుంది. ఇక దుర్యోధనుడి పుట్టుకతో కౌరవ వంశము నామరూపాలు లేకుండా నశించిపోయింది. ప్రపంచంలో పాపపుణ్యాలు అనేవి కూడా ఇలాగే ఉంటాయని ఈ పద్యంద్వారా చెప్పాడు వేమన మహాకవి.