పాపము లొందువేళ రణపన్నగ భూత భయజ్వారాదులన్
దాపద నొందువేళ భరతాగ్రజ మిమ్ము భజించువారికిన్
బ్రాపుగ నీవుదమ్ము డిరుపక్కియలన్ జని తద్విత్తి సం
తాపము మాంపి కాతురట దాశరధీ కరుణాపయోనిధి...!
తాత్పర్యం :
పాపాలు, యుద్ధం, పాము, భూతం, భయం, జ్వరం... మొదలైన వాటిచే ప్రజలకు కీడు జరిగే వేళలో... నిన్ను స్మరిస్తే.. నీవూ, లక్ష్మణుడూ చెరోవైపు, రక్షణగా నిలిచి కాపాడతారు కదా... శ్రీరామ చంద్రమూర్తీ..! అని ఈ పద్యం యొక్క భావం.