ధీరులకు జేయు మేలది
సారంబగు నారికేళ సలిలము భంగిన్
గౌరవమును మఱి మీదట
భూరిసుఖావహము నగును భువిలో సుమతీ..!
తాత్పర్యం :
కొబ్బరిచెట్టుకు నీరుపోసినట్లయితే... శ్రేష్టమైన నీరుకలిగిన కాయలను ఇస్తుంది. అట్లే బుద్ధిమంతులకు చేసిన ఉపకారము మర్యాదను, తరువాత మిక్కిలి సుఖాలను కల్గిస్తుందని ఈ పద్యం యొక్క భావం.