నీరూపంబు దలంపగా తుదమెదల్నే ఆన నీవైనచో
రారారమ్మనియంచు చెప్పవు. వృథారంబంబులింకేటికిన్
నీరున్ముంపుము పాలముంపు మిక నిన్నే నమ్మినాడంజుమీ
శ్రీరామార్చిత పాదపద్మ యుగళా..! శ్రీకాళహస్తీశ్వరా...!!
తాత్పర్యం :
శ్రీరామునిచే పూజింపబడిన పాదపద్మముల జంటగల ఈశ్వరా...! నీ రూపము తుద మొదలు నేను కనిపెట్టలేను. నీవా నన్ను రమ్మని ఆహ్వానించవు. నిన్నే నమ్మియున్నాను. పాల ముంచిననూ, నీట ముంచిననూ భారము నీదే ఈశ్వరా..! నన్ను తొందరగా కరుణించమని వేడుకొనుచున్నాను అని ఈ పద్యం యొక్క భావం.