ఆకొన్న కూడె యమృతము,
తాగొంకక నిచ్చువాcడె దాత ధరిత్రిన్,
సో కోర్సువాడె మనుజుcడు,
తేcకువగలవాడె వంశ తిలకుడు సుమతీ...!
తాత్పర్యం :
ఆకలిగా ఉన్నప్పుడు తినే అన్నమే అమృతం లాంటిదని... వెనుకా ముందూ చూడకుండా ఇచ్చేవాడే దాతయని, కష్టాలెన్ని ఎదురైనా ఓపికగా సహించేవాడే మనిషని, ధైర్యము కలిగిన వాడే కులములో పేరెన్నిగలవాడని ఈ పద్యం యొక్క భావం.