Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రేక్ ఫాస్ట్ తీసుకోని పిల్లల్లో మధుమేహం తప్పదట!

Advertiesment
Skipping breakfast may increase children’s risk of developing type 2 diabetes
బ్రేక్ ఫాస్ట్ తీసుకోని పిల్లల్లో మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా పరిశోధనలో తేలింది. ఇంగ్లండ్‌లోని పాఠశాలల్లో 10 ఏళ్లలోపు పిల్లలపై జరిపిన ఈ పరిశోధనలో బ్రేక్ ఫాస్ట్ తీసుకోని పిల్లల్లో డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలామటుకు ఉన్నాయని తేలింది. 
 
ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం ద్వారా డయాబెటిస్2 వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలియవచ్చింది. ఈ ప్రమాదం నుంచి పిల్లల్ని కాపాడుకోవాలంటే.. ఉదయం పూట అల్పాహారం తప్పకుండా తీసుకోవాల్సిందిగా నచ్చజెప్పాలి. ఉదయం పూట పీచు పదార్థాలు అధికంగా గల సహజసిద్ధమైన పండ్లు, కూరగాయలతో చేసిన వంటకాలను తీసుకునేలా చేయాలి. తద్వారా డయాబెటిస్‌తో పాటు ఒబిసిటీని కూడా దూరం చేసుకోవచ్చు.
 
తల్లిదండ్రులు ఏం చేయాలంటే..?
అల్పాహారం తీసుకోకుండా మారాం చేసే పిల్లల పట్ల శ్రద్ధ పెట్టాలి. ఆహారంలో మార్పులు చేయాలి. డైట్ ప్లాన్ మార్చాలి. పిల్లలకు నచ్చే ఆహారం ఇస్తూనే... అందులో పోషక విలువలు ఉండేలా చేసుకోవాలి. లేకుంటే కంటి సమస్యలు, కిడ్నీ వ్యాధులు, గుండె సంబంధిత రోగాలతో ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu