Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్లలు పండ్లను ఎంత తింటే అంత మంచిదట!

పిల్లలు పండ్లను ఎంత తింటే అంత మంచిదట!
, శుక్రవారం, 12 డిశెంబరు 2014 (17:25 IST)
పండ్లు, కూరగాయలు ఎంత ఎక్కువగా తింటే అంతమంచిదట. వీటిని రోజూ తీసుకోవడం వల్ల ఎలాంటి జబ్బులూ దరికి చేరవని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. రోజుకు కనీసం ఐదో వంతు పండ్లు తినాలని చెప్తున్నారు. ఎక్కువ మోతాదులో పండ్లు, కూరగాయలను తీసుకోవడం వల్ల గుండెజబ్బుల పాలిట పడరని అంటున్నారు. వీటిని నిత్యం తినడం వల్ల పిల్లల ఆయుష్షు పెరుగుతుంది.
 
ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు తినడం వల్ల రకరకాల జబ్బులను తగ్గిస్తాయి. గుండెసంబంధిత జబ్బులను దరిచేరనివ్వదు. ప్రతిరోజూ డైట్‌లో ఏడవ వంతు పండ్లు, కూరగాయలు తీసుకుంటే మంచిది. ఇలా చేయడం ద్వారా ఆరోగ్యంతో పాటు ఆయుష్షు కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu