Publish Date: Sat, 14 Mar 2015 (14:43 IST)
Updated Date: Sat, 14 Mar 2015 (14:44 IST)
అసలే పరీక్షా సమయం హోటల్ ఫుడ్ ఎలాంటి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని విద్యార్థులకు న్యూట్రీషన్ నిపులు సలహా ఇస్తున్నారు. ఎగ్జామ్స్ ప్రారంభమైన నేపథ్యంలో పిల్లల్లో అధిక ఒత్తిడి, వ్యాధి నిరోధకత తక్కువగా కనిపిస్తుంది. తద్వారా ఇన్ఫెక్షన్లకు గురవుతారు. అందుచేత చాలామటుకు హోటల్ ఫుడ్ తీసుకోకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అలాగే జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ గల చేపలు పరీక్షా సమయంలో పిల్లలకు పెట్టడం మంచిది. వారంలో సాల్మన్ ఫిష్ను డైట్లో చేర్చుకోవడం ఎంతో మంచిది. గ్రిల్ చేసిన సాల్మన్ లేదా నూనె ఎక్కువగా వాడని ఫ్రైడ్ ఆర్ బేక్డ్ సాల్మన్ తీసుకోవడం ద్వారా పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఫ్లాక్స్ సీడ్స్, గుమ్మడి గింజలు, నువ్వులతో చేసిన ఉండలు ఇవ్వడం మంచిది.
అలాగే సోయాబీన్ ఆయిల్ను వంటకు ఉపయోగించడం పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. విటమిన్ ఎ, సి, ఈ గల కోడిగుడ్లు, చేపలు, క్యారెట్, కూరగాయలు, తాజా పండ్లు ఇవ్వడం ద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఇది పరీక్షా సమయంలో పిల్లల్లో సిక్నెస్ను దూరం చేస్తుంది.
Selvi
Publish Date: Sat, 14 Mar 2015 (14:43 IST)
Updated Date: Sat, 14 Mar 2015 (14:44 IST)