Publish Date: Sat, 07 Feb 2015 (15:49 IST)
Updated Date: Sat, 07 Feb 2015 (15:51 IST)
పసిపిల్లల్ని కంటి రెప్పలా చూసుకోండి.. ఆహారం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. స్నానం చేయించేటప్పుడు, పాలు పట్టించేటప్పుడు, అన్నం తినే విషయంలోనూ అప్రమత్తంతో వ్యవహరించాలి.
పిల్లలకు ఆహారం తినిపించేటప్పుడు.. ప్లాస్టిక్ వస్తువుల్ని ఎంచుకోకూడదు. మైక్రోవేవ్లో ఆహారం వేడిచేస్తే మొదట రుచి చూసిన తర్వాతే పిల్లలకు పెట్టాలి. పసిపిల్లలకు స్పూన్లు అలవాటు చేయాలంటే గుండ్రని ఆకారంలో ఉండేలా చూసుకోవాలి. ప్లాస్టిక్ స్పూన్లు, ఫోర్కులు నాణ్యతను బట్టి ఎంచుకోవాలి.
పిల్లలు టేబుల్పై తినేటప్పుడు వేడి పదార్ధాలు టేబుల్పై ఉంచొద్దు. వేడి పదార్ధాలు వడ్డించేటప్పుడు అవి పసిపిల్లలు తినగలగలిగిన ఉష్ణోగ్రతలోనే ఉన్నాయా లేదా చూసుకోవాలి. కొద్దిగా పెద్దగా ఉన్న పిల్లలకు పచ్చికూరగాయలు, పండ్లు తినిపించాలనుకుంటే వాటిని బాగా కడిగి పెట్టాలి.
మందంగా తొక్క ఉండే దోసకాయలు, పుచ్చకాయలు, యాపిల్స్ వంటి వాటిని వెజిటబుల్ బ్రష్తో శుభ్రం చేసి గోరువెచ్చటి నీళ్లలో కడిగి ఆ తర్వాత పిల్లలకి పెట్టాలి. అరటిపళ్లు, కమలాల తొక్క సులువుగా తీయొచ్చు కాబట్టి వాటిని కడగకుండా కూడ పిల్లల చేతికి ఇవ్వొచ్చు. పిల్లలకు తిండి పెట్టే వస్తువులను వేడి నీళ్లతో కడిగితే మంచిదని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.
Selvi
Publish Date: Sat, 07 Feb 2015 (15:49 IST)
Updated Date: Sat, 07 Feb 2015 (15:51 IST)