Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మొబైల్ ఫోన్ల వాడకం వల్ల క్యాన్సర్ రాదట!

Advertiesment
మొబైల్స్ ఫోన్లు
టెలికామ్ విప్లవం పుణ్యమాన్ని ప్రస్తుతం మొబైల్ ఫోన్ ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. రోడ్లపై చేతిలో సెల్ ఫోన్ లేనివారంటూ కనిపిండం లేదు. అయితే, ఈ మొబైల్ ఫోన్లను వాడటం వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందనే ఊహాగానాలు ఉన్నాయి. దీనిపై ఎన్నో రకాల పరిశోధనలూ జరుగుతున్నాయి.

తాజాగా, లండన్‌కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ (ఐసీఆర్) సంస్థ మొబైల్స్ వాడటం వల్ల బ్రెయిన్ క్యాన్సర్‌ వస్తుందా అనే అంశంపై పరిశోధన చేయగా ఫోన్స్‌కు, బ్రెయిన్ క్యాన్సర్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చింది.

తాము వివిధ దేశాల్లో టెలిఫోనిక్ ఇంటర్ కమ్యూనికేషన్ సిస్టం విధానంలో పరిశోధన చేయగా సెల్‌ఫోన్లతో పెద్దల మెదడులో క్యాన్సర్ కణతులేర్పడతాయన్న వాదనలు తప్పని తేలిందని ఐసీఆర్‌కు పరిశోధకులు.

20 సంవత్సరాల క్రితం సెల్‌ఫోన్లు ప్రవేశించి, పదేళ్ల క్రితం విస్తృతంగా వాడకంలోకి వచ్చిన పలు దేశాల్లో కూడా అధ్యయనం నిర్వహించగా ఆ దేశాల్లో మెదడు క్యాన్సర్ పెరిగిన దాఖలాలు లేవని వారు తెలిపారు.

సెల్‌ఫోన్‌ల ద్వారా వెలువడే రేడియో తరంగాల క్షేత్రాల నుంచి జీవయంత్రాంగంలో ఏవైనా మార్పులు జరిగి క్యాన్సర్‌కు దారితీస్తుందా? అన్న కోణంలోనూ పరిశోధించగా ఎలాంటి ఆధారాలూ లభించలేదని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu