Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

18 రోజుల్లో 10 లక్షల జియోమీ ఫోన్లు విక్రయం.. మాకు భారతే అతిపెద్ద మార్కెట్ : చైనా

భారత్‌లో చైనాకు చెందిన జియోమీ ఫోన్లను ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. దీనికి నిదర్శనం గత 18 రోజుల్లో 10 లక్షల చైనా ఫోన్లను విక్రయించడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి దేశంలో చైనా ఉత్పత్తులన

18 రోజుల్లో 10 లక్షల జియోమీ ఫోన్లు విక్రయం.. మాకు భారతే అతిపెద్ద మార్కెట్ : చైనా
, శుక్రవారం, 21 అక్టోబరు 2016 (11:21 IST)
భారత్‌లో చైనాకు చెందిన జియోమీ ఫోన్లను ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. దీనికి నిదర్శనం గత 18 రోజుల్లో 10 లక్షల చైనా ఫోన్లను విక్రయించడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి దేశంలో చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయొద్దంటూ బీహార్ హైకోర్టు ఇటీవల సంచలన ఆదేశాలు జారీచేసింది. అప్పటి నుంచి చైనా ఉత్పత్తుల కొనుగోలుపై దేశంలో పెద్ద రచ్చే జరుగుతోంది. అదేసమయంలో చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. అయినప్పటికీ దీన్ని దేశ ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. 
 
చైనాకు చెందిన మొబైల్‌ ఫోన్ల కంపెనీ జియోమీ కేవలం 18 రోజుల్లోనే 10 లక్షల స్మార్ట్‌ఫోన్లను మన మార్కెట్లో విక్రయించడమే ఇందుకు నిదర్శనం. దీపావళి పండగ సీజన్‌ కావడంతో జనాలు ఎగబడి షామీ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. వచ్చే మూడు నుంచి ఐదేళ్ల కాలంలో భారత మార్కెట్లో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ల కంపెనీగా అవతరించాలన్న లక్ష్యంతో ఉన్నట్టు జియోమీ వ్యవస్థాపక సీఈఓ లీ జున్‌ పేర్కొన్నారు. ‘‘షామీ ప్రపంచీకరణ వ్యూహంలో భారత చాలా కీలకమైన మార్కెట్‌. చైనా మెయిన్‌లాండ్‌ తర్వాత భారత్ షామీకి అతిపెద్ద మార్కెట్‌గా మారింది’’  అని లీ పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవాజ్ షరీఫ్‌కు షాకుల మీద షాకులు.. సుప్రీం కోర్టు నోటీసులు.. పనామా పేపర్స్ లీక్‌తో..