Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇక పెట్టుబడులు పెట్టలేం.. కంపెనీని మూసివేయాల్సిందే.. వొడాఫోన్

ఇక పెట్టుబడులు పెట్టలేం.. కంపెనీని మూసివేయాల్సిందే.. వొడాఫోన్
, శనివారం, 7 డిశెంబరు 2019 (14:08 IST)
రిలయన్స్ జియో దెబ్బ‌తో మిగిలిన వోడాఫోన్‌, ఐడియా, ఎయిర్‌టెల్ లాంటి కంపెనీలు సైతం డేటా, కాల్స్ రేట్లు త‌గ్గించి తీవ్ర న‌ష్టాల్లో కూరుకుపోయాయి. గ‌త రెండేళ్లుగా కంపెనీల‌కు వ‌చ్చిన భారీ న‌ష్టాల నేప‌థ్యంలో చాలా కంపెనీలు ఇప్ప‌టికే మూత‌దిశ‌గా ఉన్నాయి. 
 
ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ న‌ష్టాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక యునినార్ లాంటి సంస్థ‌లు ఎప్పుడే ఎయిర్‌టెల్‌లో విలీనం అయ్యి దేశీయ మార్కెట్ నుంచి నిష్క్ర‌మించాయి. ఇక ఇప్పుడు మ‌రో అదిరిపోయే షాకింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.
 
అతి త్వరలో వొడాఫోన్ ఐడియా కంపెనీ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. నష్టాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా ఛైర్మన్ మంగళం బిర్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. కంపెనీకి కేంద్ర ప్ర‌భుత్వ స‌హాయం కావాల‌ని.. లేనిప‌క్షంలో కంపెనీని మూసివేయ‌క త‌ప్ప‌ద‌ని ప్ర‌క‌టించారు. 
 
హెచ్‌టీ లీడర్ షిప్ సమ్మిట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం, సహకారం అందించాలని లేకపోతే కంపెనీని మూసివేయాల్సి వస్తుందని అన్నారు.ఈ భారీ న‌ష్టాల నేప‌థ్యంలో ఇక‌పై మేం ఇందులో పెట్టుబ‌డులు కూడా పెట్ట‌మ‌ని తేల్చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శునకం కోసం సింహంతో తలపడిన యజమాని.. చివరికి ఏమైందంటే?