Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుందర్ పిచాయ్‌కు గ్రేట్ ఇమ్మిగ్రెట్స్ అవార్డు.. మరో ముగ్గురికి కూడా..

భారత సంతతి వ్యక్తి, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ను అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు అయిన ''గ్రేట్ ఇమ్మిగ్రెట్స్: ది ప్రైడ్ ఆఫ్ అమెరికా'' అవార్డు వరించింది. ఈయనతో పాటు మరో ముగ్గురికి కూడా ఈ ప్రత్యేక పురస్కా

సుందర్ పిచాయ్‌కు గ్రేట్ ఇమ్మిగ్రెట్స్ అవార్డు.. మరో ముగ్గురికి కూడా..
, గురువారం, 30 జూన్ 2016 (11:05 IST)
భారత సంతతి వ్యక్తి, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ను అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు అయిన ''గ్రేట్ ఇమ్మిగ్రెట్స్: ది ప్రైడ్ ఆఫ్ అమెరికా'' అవార్డు వరించింది. ఈయనతో పాటు మరో ముగ్గురికి కూడా ఈ ప్రత్యేక పురస్కారం అందనుంది. జూన్ 30న జరిగే కార్యక్రమంలో ఎంపికైన వారిని అమెరికాలోని కార్నీజియా కార్పొరేషన్ సత్కరించనుంది. సుందర్ పిచాయ్‌తో పాటు పీబీఎస్ న్యూస్ అవర్‌కు చెందిన ప్రఖ్యాత వ్యాఖ్యాత, సినియర్ కరస్పాండెంట్ హరి శ్రీనివాసన్, మెకన్సీ అండ్ కంపెనీ ఛైర్మన్ విక్రమ్ మల్హోత్రా, నేషనల్ బుక్ క్రిటిక్ సర్కిల్ అవార్డు విజేత, రచయిత భారతీ ముఖర్జీలకు ప్రైడ్ ఆఫ్ అమెరికా అవార్డును అందజేయనున్నారు. 
 
అమెరికాకు గర్వకారణమైన నలుగురు ప్రవాస భారతీయులకు ఆదేశం ప్రత్యేక గౌరవాన్ని అందించనుంది. 'గ్రేట్ ఇమ్మిగ్రెంట్ ప్రైడ్ ఆఫ్ అమెరికా' పేరిట కార్నెగీ కార్పొరేషన్ ఈ అవార్డులను ప్రతి యేటా అందిస్తున్నసంగతి తెలిసిందే. 2016 సంవత్సరానికి గానూ విదేశీ మూలాలు కలిగిన మొత్తం 30 దేశాలకు చెందిన 42 మందిని పురస్కారాలకు ఎంపిక చేయగా.. వారిలో ప్రవాస భారతీయులు నలుగుర్ని ఈ ప్రత్యేక పురస్కారం వరించింది. 
 
ఈ సందర్భంగా కార్నిజీయా కార్పొరేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ''మనపూర్వీకుల లాగే  వీరుకూడా అమెరికాకు వలసవచ్చి దేశాభివృద్ధిలో ముందడుగు వేస్తున్నారు. ఆర్థిక అవకాశాల కోసం విద్య, రాజకీయాలు, భద్రతా తదితర కారణాలతో వచ్చే లక్షలాది వలసవాదులకు వీరు ప్రతినిధులుగా ఉన్నారు. సగటు అమెరికన్ పౌరుడు దేశాన్ని ఏ విధంగానైతే ప్రేమిస్తున్నాడో అదేతీరు విశ్వాసాన్ని వీరు కలిగిఉన్నారని ఆయన చెప్పడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ ఓ డంపింగ్ యార్డు.. డొక్కు కార్లన్నీ వారికి అమ్మేద్దాం.. ఇదీ అంతర్జాతీయ కంపెనీల భావన!