Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రిలయన్స్ జియో మరో సంచలనం... ఏంటో తెలుసా?

రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధమైంది. ఇప్పటికే అతి తక్కువ ధరకే డేటా ప్యాక్స్‌ను, ఉచిత వాయిస్ కాల్స్‌ను అందిస్తున్న రిలయన్స్ జియో.. మరో సంచలనానికి తెరతీసేందుకు ముందుకురానుంది. అయితే, ఈ దఫా మధ్యతరగతి

రిలయన్స్ జియో మరో సంచలనం... ఏంటో తెలుసా?
, గురువారం, 10 నవంబరు 2016 (11:02 IST)
రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధమైంది. ఇప్పటికే అతి తక్కువ ధరకే డేటా ప్యాక్స్‌ను, ఉచిత వాయిస్ కాల్స్‌ను అందిస్తున్న రిలయన్స్ జియో.. మరో సంచలనానికి తెరతీసేందుకు ముందుకురానుంది. అయితే, ఈ దఫా మధ్యతరగతి వాసులను టార్గెట్ చేసుకోనున్నారు. 
 
డీటీహెచ్ రంగంలోకి రిలయన్స్ జియో అడుగుపెట్టాలని ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ భావిస్తున్నారు. ఆరంభంతోనే ఇతర డీటీహెచ్ కంపెనీలను కోలుకోలేని దెబ్బకొట్టేందుకు ప్రణాళిక సిద్ధమైంది. దేశంలో ఏ డీటీహెచ్ సర్వీస్ ఆపరేటర్ ప్రకటించనంత తక్కువగా జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించనుంది. ఇతర కంపెనీలు 275 నుంచి 300 రూపాయలకు అందించే నెలవారీ డీటీహెచ్ ప్యాక్‌ను ముఖేష్ అంబానీ 185 రూపాయలకే అందించాలని భావిస్తున్నారట.
 
ఇది ఎయిర్‌టెల్‌కు భారీ నష్టాన్ని మిగిల్చే అవకాశముందని టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదేగానీ జరిగితే డీటీహెచ్ రంగంలో రిలయన్స్ జియో హవా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎయిర్‌టెల్, టాటా స్కై, డిష్ టీవీ యాజమాన్యాలను ఈ నిర్ణయం కోలుకోలేని దెబ్బ తీస్తుంది. అయితే ఈ రిలయన్స్ జియో డీటీహెచ్ సర్వీస్‌కు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హల్లో డోనాల్డ్ ట్రంప్.. "నువ్వు మా అధ్యక్షుడివి కాదు" భగ్గుమంటున్న అమెరికన్లు...