రిలయన్స్కు చుక్కలు చూపుతున్న టెలికాం కంపెనీలు.. జియో నుంచి ఫోన్ వచ్చిందా.. కాల్డ్రాప్...
రిలయన్స్ జియోకు టెలికాం కంపెనీలు చుక్కలు చూపుతున్నాయి. జియో నుంచి ఇతర టెలికాం నెట్వర్క్లకు వచ్చే ఫోన్ కాల్స్ అన్నీ కాల్ డ్రాప్ అవుతున్నాయి. దీంతో జియో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత 1
రిలయన్స్ జియోకు టెలికాం కంపెనీలు చుక్కలు చూపుతున్నాయి. జియో నుంచి ఇతర టెలికాం నెట్వర్క్లకు వచ్చే ఫోన్ కాల్స్ అన్నీ కాల్ డ్రాప్ అవుతున్నాయి. దీంతో జియో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత 10 రోజుల్లోనే జియో కస్టమర్లు 52 కోట్ల కాల్స్ ఫెయిలయ్యాయి. ఇది రిలయన్స్ జియోకు గట్టి ఎదురుదెబ్బవంటిది.
దీనికి కారణం లేకపోలేదు. ఫ్రీ వాయిస్ కాల్స్ ఇస్తామంటే ఏం చేయలేక ఇతర కంపెనీలు చేతులెత్తేశాయి. కానీ రిలయన్స్ జియో తమ పొట్ట కొడుతున్నాయని భావించిన అన్ని కంపెనీలు ఒక్క విషయంలో మాత్రం ఏకమయ్యాయని జియో చెబుతోంది. తమ నెట్వర్క్ నుంచి చేసే కాల్స్పై అన్ని కంపెనీలు కక్ష కట్టాయని జియో ఆరోపిస్తోంది.
కాల్ డ్రాప్స్ విషయంలో ఎయిర్టెల్పైనే రిలయన్స్ జియో ప్రధానంగా ఆరోపిస్తోంది. కస్టమర్ల నుంచి వచ్చే ఫిర్యాదులకు సమాధానం చెప్పలేక జియో నానా అవస్థలు పడుతోంది. జియో వినియోగదారులు ఒక్క వొడాఫోన్ నెట్వర్క్కే ఈ 10 రోజుల్లో 52 కోట్ల కాల్స్ ఫెయిలయినట్లు తెలిసింది. జియో నుంచి వొడాఫోన్కు 100 కాల్స్ చేస్తుంటే అందులో 80 కాల్స్ ఫెయినట్లు తేలింది.
ఈ కాల్డ్రాప్స్ సమస్యతో దాదాపు రోజుకు 5 లక్షల మంది వినియోగదారులు ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. ఇది టెలికామ్ కంపెనీల మధ్య నెలకొన్న ఈ ఘర్షణ వాతావరణం వినియోగదారులను చిక్కుల్లోకి నెట్టేస్తోంది. ఈ విషయాన్ని టెలికామ్ రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ దృష్టికి రిలయన్స్ జియో తీసుకెళ్లింది.