హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ కనెక్టెడ్ జీవనశైలి బ్రాండ్ అయిన నాయిస్, తమ తాజా ఆడియో ఆవిష్కరణ, నాయిస్ మాస్టర్ బడ్స్ను విడుదల చేసింది. ఇది బోస్ టెక్నాలజీతో ట్యూన్ చేయబడిన ఆడియోతో కూడిన నిజమైన వైర్లెస్ ఇయర్బడ్ శ్రేణిలా ఉంటుంది. ఇటీవల ఆవిష్కరించబడిన మాస్టర్ సిరీస్లోని మొదటి ఉత్పత్తి ఇది. ప్రతి బీట్, నోట్, లిరిక్ను అధిక నాణ్యతతో అందించడానికి రూపొందించబడింది. లీనమయ్యే శ్రవణ అనుభవాన్ని కోరుకునే వినియోగదారులకు ఆకర్షణీయమైన ఎంపికను నాయిస్ మాస్టర్ బడ్స్ అందిస్తాయి.
అధునాతన 49dB ANCని కలిగి ఉన్న నాయిస్ మాస్టర్ బడ్స్ వినియోగదారుల కోసం లీనమయ్యే శ్రవణా అనుభవాన్ని సృష్టిస్తుంది. దీర్ఘకాలిక సౌకర్యం కోసం నిర్మించబడిన ఈ ఇయర్బడ్లు ఇంతకుముందు ఎన్నడూ చూడని డిజైన్లో ఆకార్షణీయమైన నిర్మాణం కలిగి ఉంటాయి. డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ, గూగుల్ ఫాస్ట్ పెయిరింగ్ వంటి అధునాతన లక్షణాలను కలిగిన, నాయిస్ మాస్టర్ బడ్స్ పనితీరు, సౌలభ్యం యొక్క మిశ్రమాన్ని అందిస్తాయి.
ఈ ఆవిష్కరణపై నాయిస్ సహ వ్యవస్థాపకుడు అమిత్ ఖత్రి మాట్లాడుతూ, “నాయిస్ మాస్టర్ బడ్స్ను విడుదల చేయటంతో, భారతీయ ఆడియో మార్కెట్లో కొత్త బెంచ్మార్క్ను ఏర్పాటు చేస్తున్నాము. ఇది అధిక-నాణ్యత ధ్వనిని అందిస్తుంది. ప్రీమియం అనుభవాన్ని అందించే వేరబల్ వస్తువులకు పెరుగుతున్న డిమాండ్తో దక్షిణ భారతదేశం మాకు కీలక మార్కెట్గా ఉంది. ఈ ప్రాంతంలోని వినియోగదారులకు మాస్టర్ బడ్స్ శ్రవణ అనుభవాన్ని మెరుగుపరుస్తుందని మేము విశ్వసిస్తున్నాము” అని అన్నారు.