Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోటారోలా నుంచి సరికొత్త ఫోన్.. చైనాలో రిలీజ్.. భారత్‌లో ఎప్పుడో...?

మోటారోలా నుంచి సరికొత్త ఫోన్.. చైనాలో రిలీజ్.. భారత్‌లో ఎప్పుడో...?
, మంగళవారం, 25 మే 2021 (13:31 IST)
Motorola Edge S
అమెరికన్ దిగ్గజ కంపెనీ మోటారోలా నుంచి సరికొత్త ఫోన్ లాంఛ్ అయ్యింది. అదే మోటోరోలా ఎడ్జ్ ఎస్ పయొనీర్ ఎడిషన్. వెనిల్లా కలర్ వేరియంట్లో ఇది అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఫోన్ ను సంస్థ ప్రస్తుతం చైనా మార్కెట్లో విడుదల చేసింది. 
 
ఈ మిడ్-రేంజ్ మోటోరోలా ఫోన్ ను ఆ దేశంలో సింగిల్ కాన్ఫిగరేషన్ తోనే వచ్చింది. చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ భారత్ మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుందనే అంశంపై స్పష్టత లేదు. ధర కూడా ఇతర కలర్ వేరియంట్ల కంటే తక్కువగా ఉండటం విశేషం.
 
ఈ ఏడాది ప్రారంభంలోనే మోటోరోలా ఎడ్జ్ ఎస్ ఫోన్ ను లాంచ్ చేసింది. దీంట్లో స్నాప్ డ్రాగన్ 870 SoC ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్, 256 జీబీ ర్యామ్ స్టోరేజి వంటి ఫీచర్లు ఉన్నాయి.
 
ఈ సరికొత్త ఫోన్ ధర 1999 యువాన్లు(దాదాపు రూ.22,600)గా ఉంది. ఇది 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీని కలిగి ఉంటుంది. ఇతర కలర్స్ వేరియంట్లయిన ఎమరాల్డ్ లైట్, మిస్ట్ ధర కూడా 1999 యువాన్లే. అయితే ఈ ఫోన్లు 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మలేషియా రెండు రైళ్ల ఢీ.. సొరంగ మార్గంలో అదెలా సాధ్యం...200మందికి పైగా గాయాలు