Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యువకుడి భీష్మ ప్రతిజ్ఞ - వీరాభిమాని కోర్కె తీర్చిన షియోమీ!

యువకుడి భీష్మ ప్రతిజ్ఞ - వీరాభిమాని కోర్కె తీర్చిన షియోమీ!
, బుధవారం, 23 డిశెంబరు 2020 (09:27 IST)
భారతీయ మొబైల్ మార్కెట్‌లో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న కంపెనీల్లో షియోమీ ఒకటి. ఈ ఫోన్లకు ఉన్న డిమాండ్ అంతాఇంతాకాదు. తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లతో లభ్యమయ్యే ఫోన్లను షియోమీ అందుబాటులోకి తెస్తోంది. దీంతో ఈ కంపెనీ ఫోన్లకు భలే డిమాండ్ ఉంది. ఈ కారణంగానే భారతీయ మొబైల్ మార్కెట్‌లో షియోమీ అగ్రగామిగా కొనసాగుతోంది.
 
అయితే, కమల్ అహ్మద్ అనే యువకుడికి షియోమీ ఫోన్ల వీరాభిమాని. ఈ క్రమంలో ఇటీవల షియోమీ ఎంఐ 10టీ ప్రో ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోనును కొనాలన్నది అతని కోరిక. అయితే వేలాది రూపాయలు చెల్లించి కొనలేని స్థితి. దీనికి కారణం ఆయన ఆర్థిక స్థితి అంతంతమాత్రమే. 
 
ఈ క్రమంలో షియోమీ ఎంఐ 10టీ ప్రో ఫోన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఆ ఫోన్‌ను కొనేందుకు డబ్బులు పొదుపు చేస్తున్న కమల్... ఈ ఫోన్‌ను కొనేవరకు తాను పెళ్లి చేసుకోబోనని ఫన్నీగా ట్వీట్ చేశాడు.
 
ఈ ట్వీట్ కాస్త షియోమీ కంపెనీ భారత బృందానికి చేరింది. ఈ ట్వీట్‌ను షియోమీ పరిగణనలోకి తీసుకుంది. వెంటనే అతడు కోరుకున్న లేటెస్ట్ మోడల్ ఫోన్‌ను ఉచితంగా పంపించింది. అనంతరం, షియోమీ ఇండియా అధిపతి మనుకుమార్ జైన్ స్పందిస్తూ... 'ఇప్పుడిక నువ్వు పెళ్లికి సిద్ధం అనుకుంటా!' అంటూ కొంటెగా ట్వీట్ చేశారు. ఈ ఉదంతం నెట్టింట వైరల్‌గా మారింది.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంటార్కిటికాలో తొంగిచూసిన కరోనా.. 58మందికి పాజిటివ్