Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు రాష్ట్రాలకు జియో ఎయిర్ ఫైబర్ సర్వీస్

jioservice
, సోమవారం, 13 నవంబరు 2023 (22:20 IST)
జియో ఎయిర్ ఫైబర్ సర్వీస్ తాజాగా దేశంలోని మరో 115 నగరాలు, పట్టణాలకు అందుబాటులోకి రానుంది. జియో ఎయిర్ ఫైబర్ సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే 16కి పైగా ఓటీటీ యాప్ లు, 550కి పైగా డిజిటల్ టీవీ చానళ్లు కూడా అందుబాటులోకి వస్తాయి.  
 
ఈ తాజాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ మరిన్ని పట్టణాల్లో ప్రస్తుతం జియో ఎయిర్ ఫైబర్ అందుబాటులోకి వస్తోంది. 5జీ సాంకేతికతతో కూడిన ఈ బ్రాడ్ బ్యాండ్ సేవలు తెలుగు రాష్ట్రాలకు చెందిన మరికొన్ని పట్టణాలకు రానుంది.
 
ఏపీలో తిరుపతి, రాజమండ్రి, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, కడప, విజయనగరం, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు పట్టణాల్లో జియో ఎయిర్ ఫైబర్ సేవలు అందించాలని రిలయన్స్ నిర్ణయించింది.
 
తెలంగాణలో... పెద్దపల్లి, మహబూబ్ నగర్, ఖమ్మం, సిద్ధిపేట, కొత్తగూడెం, సంగారెడ్డి, మంచిర్యాల, రామగుండం, పాల్వంచ, వరంగల్, ఆర్మూరు, సిరిసిల్ల, మిర్యాలగూడ, నిజామాబాద్, నిర్మల్, తాండూరు, జగిత్యాల, సూర్యాపేట, కరీంనగర్ పట్టణాలకు జియో ఎయిర్ ఫైబర్‌ను విస్తరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

17వ తేదీన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల