Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గూగుల్‌తో జియో ఒప్పందం... రూ.2 వేలకే 4జీ స్మార్ట్ ఫోన్లు

ఇంటర్నెట్ సెర్చ్ దిగ్గజం గూగుల్‌తో రిలయన్స్ జియో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో ఇరు సంస్థలు కలిసి సరికొత్త 4జీ స్మార్ట్ ఫోన్‌‍ను తయారు చేయనున్నాయి. ఈ ఫోన్ ధర రూ.2 వేలు మాత్రమే.

Advertiesment
Google
, మంగళవారం, 14 మార్చి 2017 (15:31 IST)
ఇంటర్నెట్ సెర్చ్ దిగ్గజం గూగుల్‌తో రిలయన్స్ జియో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో ఇరు సంస్థలు కలిసి సరికొత్త 4జీ స్మార్ట్ ఫోన్‌‍ను తయారు చేయనున్నాయి. ఈ ఫోన్ ధర రూ.2 వేలు మాత్రమే. మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని ఈ సంస్థలు భావిస్తున్నాయి.  
 
అంతేకాదు ఈ రెండు సంస్థలు కలిసి టెల్‌కో స్మార్ట్ టీవీ సర్వీసులను కూడా వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే పలు చైనా ఫోన్ కంపెనీలతో జియో ఒప్పందాలు కుదుర్చుకుంది. కొన్ని ఫోన్లను కూడా మార్కెట్లోకి తెచ్చింది. 
 
లావా ఇంటర్నేషనల్, మరికొన్ని కంపెనీలతో కలిసి జియో 4జీ వీఓఎల్టీఈ ఫోన్లను ఆవిష్కరించిన విషయం తెల్సిందే. ఈ ఫోన్లను వెయ్యి రూపాయలకే అందుబాటులోకి తీసుకురానుంది. అంతేకాదు, ఇటీవలే చైనీస్, తైవానీస్ కంపెనీ ఒరిజినల్ డివైస్ మ్యాన్యుఫ్యాక్చర్స్‌తో తమ 4జీ ఫోన్లను తయారు చేయాలని జియో కోరింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గవర్నర్ నరసింహన్‌కు కేసీఆర్ రూ.50 కోట్ల గిఫ్ట్...! ఏంటది?