Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్ ఐటీ కంపెనీల్లో పాకిస్థాన్ దొంగలు.. 'రాన్సమ్‌వేర్'తో సమాచారం తస్కరణ

హైదరాబాద్‌లోని ఐటి కంపెనీల్లో దొంగలుపడ్డారు. రాన్సమ్‌వేర్‌ను ఉపయోగించి పలు కంపెనీల్లోని విలువైన సమాచారాన్ని తస్కరించారు. సమాచారాన్ని తస్కరించడం గత పది రోజులుగా సాగుతోంది. ఇదే అంశంపై సొసైటీ ఫర్ సైబరాబా

Advertiesment
Pakistani hackers
, శుక్రవారం, 14 అక్టోబరు 2016 (14:59 IST)
హైదరాబాద్‌లోని ఐటి కంపెనీల్లో దొంగలుపడ్డారు. రాన్సమ్‌వేర్‌ను ఉపయోగించి పలు కంపెనీల్లోని విలువైన సమాచారాన్ని తస్కరించారు. సమాచారాన్ని తస్కరించడం గత పది రోజులుగా సాగుతోంది. ఇదే అంశంపై సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సిఎస్‌సి) ప్రతినిధి మాట్లాడుతూ పాకిస్థాన్‌కు చెందిన కొందరు హ్యాకర్లు గత పది రోజులుగా హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలపై సైబర్ దాడులు చేస్తున్నట్టు చెప్పారు. 
 
'రాన్సమ్‌వేర్'ను ఉపయోగించి వాళ్లు సమాచారాన్ని దొంగిలించారని, దీనిపై దర్యాప్తు మొదలైందని చెప్పారు. డీక్రిప్షన్ కీలు కావాలంటే పెద్దమొత్తంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. టర్కీ, సోమాలియా, సౌరీ అరేబియా వంటి దేశాల్లో ఉన్న సెర్వర్లను ఉపయోగించుకుని పాక్ హ్యాకర్లు ఈ దాడులు చేశారని సైబర్ సెక్యూరిటీ ఫోరం అధికారులు వెల్లడించారు. 
 
ఈ హ్యాకర్ల దాడిపై కొన్ని ఐటీ సంస్థలు నేరుగా ఈ విషయాన్ని ఎస్‌సిఎస్‌సికి ఫిర్యాదుచేయగా, మరికొన్ని ప్రైవేట్ సైబర్ సెక్యూరిటీ సంస్థల ద్వారా కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చాయి. అయితే సంస్థల భద్రత దృష్ట్యా ఏయే కంపెనీలపై సైబర్ దాడులు జరిగాయో మాత్రం వెల్లడించడం లేదు. సైబరాబాద్ పరిధిలో మొత్తం 2,500 ఐటీ కంపెనీలు ఉన్నాయి. వాటిలో 1300 పెద్ద కంపెనీలు. ఇవి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కాం)లో రిజిస్టరై ఉన్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా తమ సేవలు అందిస్తుంటాయి. ప్రధానంగా వీటి క్లయింట్స్ అమెరికా, యూరోపియన్ దేశాల్లో ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్ కోసం కేంద్రం చట్ట సవరణ.. పెరగనున్న రుణపరిమితి