Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బంపర్ ఆఫర్‌ ప్రకటించిన ఎయిర్‌టెల్... జియోకు ధీటుగా

దేశ టెలికాం రంగంలో ధరల యుద్ధం కొనసాగుతోంది. రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు వీలుగా మిగిలిన ప్రైవేట్ కంపెనీలు కూడా భారీ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా టెలికాం దిగ

బంపర్ ఆఫర్‌ ప్రకటించిన ఎయిర్‌టెల్... జియోకు ధీటుగా
, శనివారం, 4 మార్చి 2017 (18:23 IST)
దేశ టెలికాం రంగంలో ధరల యుద్ధం కొనసాగుతోంది. రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు వీలుగా మిగిలిన ప్రైవేట్ కంపెనీలు కూడా భారీ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ఓ భారీ ఆఫర్‌ను ప్రకటించింది. 
 
ఈ ఆఫర్ మేరకు... కేవలం రూ.345 రిచార్జ్‌తో రోజుకు 1 జీబీ డాటా చొప్పున 28 రోజులపాటు 28 జిబి డాటా, అపరిమిత లోకల్, నేషనల్ ఫోన్‌కాల్స్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే 1 జిబి డాటాను పగలు 500 ఎంబీలు, రాత్రి సమయంలో 500 ఎంబీల చొప్పున వినియోగించుకునే పరిమితిని విధించింది. 
 
ఈ ఆఫర్‌ను పొందాలంటే 4జి మొబైల్ కలిగిన యూజర్లు మార్చి 31 లోపు రూ.345తో రిచార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. మార్చి 31 లోపు చేయించుకున్న వారు తదుపరి 11 నెలలు ఇదే తరహా ఆఫర్‌ను పొందవచ్చు. జియో ప్రైమ్ ఆఫర్‌‌కు ఛాలెంజ్ విసురుతూ ఈ సరికొత్త ఆఫర్‌ను ఎయిర్ టెల్ ప్రకటించడం గమనార్హం. 
 
అలాగే, రూ.549తో రిచార్జ్ చేసుకునే కస్టమర్లు మాత్రం రోజుకు 1 జీపీ డాటాను ఎలాంటి ఆంక్షలు లేకుండా వినియోగించుకోవచ్చు. ఇది కూడా 28 రోజుల కాలపరిమితి కలిగివుంటుంది. అన్‌లిమిటెడ్ ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనూషపై కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందిచ్చి రేప్.. 20మందిని రాజేష్ మోసం చేశాడు.. మొత్తం 19 కేసులు?