బ్రాడ్కామ్ టెక్నాలజీతో సెల్కాన్ ఏ-13 స్మార్ట్ఫోన్
స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి మరో ఫోన్ వచ్చింది. తాజాగా సెల్కాన్ సంస్థ ఈ ఫోన్ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. బ్రాడ్కామ్ టెక్నాలజీతో ఏ-19 పేరుతో 3జీ స్మార్ట్ఫోన్ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దేశీయ సంస్థల్లో తొలిసారిగా బ్రాడ్కామ్ టెక్నాలజీని వినియోగించమని సెల్కాన్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వై.గురు వెల్లడించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ఈ డ్యుయల్ సిమ్ ఫోన్ ప్రత్యేకతల్లో ప్రధానంగా ఆండ్రాయిడ్ 2, 3, 6 వెర్షన్, 832 మెగాహెడ్జ్ ప్రాసెసర్, 512 ఎంబీ రామ్, 10.2 సెంటిమీటర్ల కెపాసిటివ్ టచ్ స్క్రీన్ ఉన్నాయి. వీటితో పాటు 1400 ఎంహెచ్ బ్యాటరీ, ఆటో ఫోకస్ తో కూడిన 5 మెగాపిక్సెల్ కామెరా, ఫ్లాష్ లైట్, వైఫై, జిపిఏస్తో 32 జీబి వరకు పెంచుకోవచ్చని వివరించారు. ఏ19 స్మార్ట్ఫోన్ రూ.8000కే లభిస్తుందని అన్నారు.