Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‌ఫిత్రా నియమాలను సరిగ్గా పాటిస్తున్నారా?

Advertiesment
ఆధ్యాత్మికం
WD
ఫిత్రాను అందజేయడానికి ఓ పరిమితి ఉంది. ఫిత్రాను ఏ సమయంలో ఇవ్వాలి. అదేవిధంగా ఫిత్రాను ఎలా ఇవ్వాలనే విషయంపై ఇస్లాం పెద్దలు ఇలా అంటున్నారు.

ముహమ్మద్ ప్రవక్త (సఅస) కాలంలో ఉపవాసముండే వారు ఇతరులకు అన్నదానం చేస్తారు. అంతేగాకుండా ఖర్జూరపండ్లు, గోధుమలు, ద్రాక్షపండ్లను ఒక ఫిత్రాగా ఇస్తామని అబు సహీదుల్ ఖాద్రి (రయి) బుకారిలో పేర్కొన్నారు.

ఫిత్రాను రెండు చేతులారా నాలుగు సార్లు దానం చేయాలని ఖురానులో పేర్కొనబడింది. అందుచేత ఉపవాసముండే భక్తులు దానమిచ్చే సమయంలో రెండు చేతులారా, మనసారా నాలుగు సార్లు దానం చేయాలని ముస్లిం మత పెద్దలు అంటున్నారు.

ఈ ఫిత్రాను రంజాన్‌కు రెండు రోజులకు ముందుగానో, లేదా రంజాన్ నమాజ్‌కు తర్వాతైనా ఇవ్వాలి. అయితే రంజాన్ నమాజ్‌కు తర్వాత ఇచ్చే దానాన్ని ఫిత్రాగా భావించడం లేదని ఇస్లాం పెద్దలు చెబుతున్నారు.

అందుచేత రంజాన్ నమాజ్‌కు బయలుదేరే ముందే దానధర్మాలు చేయాలని ముహమ్మద్ ప్రవక్త (సఅస) చెప్పినట్లు బుఖారిలో ఉమర్ (రయి) పేర్కొన్నారు.

ఈ ఫిత్రాను తమ ఇరగుపొరుగు వారికే కాకుండా కడుపేదరికాన్ని అనుభవించేవారికి కూడా రంజాన్‌ పండుగకు రెండురోజుల ముందే ఇవ్వాలని బుఖారీ పేర్కొన్నారు. ఫిత్రాను తీసుకునేందుకు పేద ప్రజలు ముస్లింల ఇంటి ముందు నిలబడే పరిస్థితిని పక్కనబెట్టేందుకు వీలుగా.. రంజాన్ నెలలో ఉపవాసముండే మహమ్మదీయులందరూ ఫిత్రాను ఒకేచోట చేర్చి ఆ ఊరికి చెందిన పేద ప్రజలను పిలిచి ఫిత్రా అందజేస్తే వారి జీవితాలు ప్రకాశిస్తాయని ఇస్లాం మతం చెబుతోంది.

ఇలా ఫిత్రాను ఒకే చోట ఇవ్వడం ద్వారా అధిక సంఖ్యలో పేదలు లబ్ది పొందుతారని మత పెద్దలు చెబుతున్నారు. అందుచేత ఫిత్రా ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో మహమ్మదీయులంతా పేద ప్రజలను ఆదుకునేందుకు గాను దానధర్మాలు చేస్తుంటారు.

ఇదిలావుండగా ముస్లింలు జరుపుకునే అతి ఘనమైన పండుగ రంజాన్ కాబట్టి ఈ పండుగానాడు ప్రతి ఒక్కరు ఆనందంగా తమలాగే పండుగను జరుపుకోవాలని దానధర్మాలు చేయడం పరిపాటిగా వస్తున్న ఆచారం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈదుల్-ఫిత్ర్ నమాజుకు వెళ్ళే ముందు దాన ధర్మాలు చేస్తూ...శ్లోకాలు పఠిస్తూ, సమాజ శ్రేయస్సు కోసం అందరం పాటుపడాలని అల్లాను ప్రార్థిస్తూ... ఈద్‌గాహ్‌కు తరలి వెళతారు.

అక్కడికి చేరుకున్నాక ఈదుల్-ఫిత్ర్ రెండు రకాతుల నమాజును పూర్తి చేస్తారు. ఈ నమాజు తర్వాత మత పెద్ద ఉపన్యాసం ఉంటుంది. దీనిని విన్న తర్వాత ప్రపంచంలోని ప్రజలందరూ సుఖశాంతులతో విలసిల్లాలని దువా(ప్రార్థన) చేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu