Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ. 8.8 కోట్ల ధర పలికిన సువర్ణాక్షర ఖురాన్

Advertiesment
రూ. 8.8 కోట్లు ధర సువర్ణాక్షర ఖురాన్
, గురువారం, 25 అక్టోబరు 2007 (15:10 IST)
13వ శతాబ్దంలో సువర్ణాక్షరాలతో రాసిన ఖురాన్ భారీ ధర పలికింది. ఈ ఖురాన్‌ను క్రిస్టీ అనే కంపెనీ వేసిన వేలంలో ఈ ధరను నమోదు చేసుకున్నట్లు క్రిస్టీ కంపెనీ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఖురాన్, ఇస్లామిక్ రాతపత్రుల అమ్మకాల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఖురాన్‌ను వేలంలో భారత కరెన్సీకి రూ. 8.8కోట్లతో ఓ వ్యక్తి సొంతం చేసుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

పూర్తిస్థాయిలో సువర్ణాక్షర లిఖితమైన ఈ ఖురాన్‌ను 1203లో రాశారని, చుట్టూ మార్జినల్ నోట్స్ ఉన్నాయని కంపెనీ నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా వేలంలో తాము అనుకున్న దానికంటే మూడింతలు ధర పలికిందని వారు అన్నారు. సువర్ణాక్షరాలతో రాయడం మాత్రమే కాకుండా తేదీతో పాటు ఉన్న ఖురాన్ ఇదేనని వారు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu