హిందూవులు కార్తీక మాసం, వైశాఖ మాసం... అంటూ ఏడాది పొడవునా ఏవో వ్రతాలు ఆచరిస్తూనే ఉంటారు. అయితే ముస్లింలకు మాత్రం అతి పవిత్రమైన మాసం రంజాన్ మాసం. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఈ నెల వస్తుంది. బక్రీద్ తదితర పండుగుల వచ్చినా, ముస్లింలకు అత్యంత పవిత్రమైన మాసం, ముఖ్య పండుగ రంజానే. |
రంజాన్ నెలలో ముఫ్పై రోజుల పాటు ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష చేపడతారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసం ఉంటారు. |
|
|
దీనినే ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ అని కూడా అంటారు. అంటే ఉపవాసాన్ని విరమించడం అని అర్థం. ఈ నెలలో ముఫ్పై రోజుల పాటు ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష చేపడతారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసం ఉంటారు. కనీసం నోట్లో ఊరే లాలాజలం కూడా మింగరు.
సూర్యాస్తమయం తర్వాత నమాజ్ చేసి దీక్షను విరమించి భోజనం చేస్తారు. మరుసటి రోజు ఉదయాన్నే మళ్లీ నమాజ్తో దీక్షను ప్రారంభిస్తారు. రంజాన్ నెలలోనే తమ పవిత్ర గ్రంథమైన "ఖురాన్" దివి నుంచి దైవదూత భువికి తీసుకువచ్చారని ముస్లంల నమ్మకం.
రంజాన్ నెల చివరి పది రోజుల్లో ఓ రోజు ఈ గ్రంథం భూమి మీదకి వచ్చిందని వారు విశ్వసిస్తారు. ఆ సమయంలో "అల్లా" ముస్లింలకు కొన్ని నిబంధనలు విధించారని వారు చెప్తారు. డబ్బున్న వారు, ధనవంతులు పేదవారికి సాయం చేయాల్సి ఉంటుంది. కనీసం నిత్యావసరాలు కూడా లేకుండా కష్టపడే వారికి దానాలు చేసి వారిని ఆదుకోవాలి.
అయితే అప్పుగా మాత్రం ఇవ్వ కూడదు. ఆహారం, దుస్తులు, డబ్బు తదితరాలు దానంగా ఇవ్వచ్చు. కనుకనే ఈ నెలలో ముస్లింలు విరివిగా దానాలు చేస్తారు. వారు సంపాదించిన దానిలో సగం దానం చేసేందుకే ఉపయోగిస్తారు. అయితే మైలు తదితరాలు వచ్చిన వారు మాత్రం తమ రోజాలను (ఉపవాసాలు) ఆపేస్తారు.