ముస్లిములకు అల్లా అందించిన గొప్ప వరాలలో ఒకటిగా చెప్పుకునే ఈదుల్ ఫితర్ను ఆదివారం జరుపుకోనున్నారు. శుక్రవారంనాడు నెలవంక దర్శనమీయకపోవటంతో ఈ వేడుకను రేపు జరుపుకుంటున్నట్లు ఢిల్లీలోని ఫతేపురి మసీదు షాహి ఇమామ్ ముఫ్తీ మహ్మద్ ముఖ్రర్ అహ్మద్ తెలియజేశారు.
ప్రపంచవ్యాప్తంగా రంజాన్ పండుగరోజును పురస్కరించుకుని సెప్టెంబరు 12 నుంచి ముస్లిములు రోజా ఉపవాస వ్రతాన్ని పాటిస్తున్నారు.