ముస్లింలు యోగా చేయడంపై నిషేధం విధిస్తూ ఇండోనేషియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిది కాదని భారతీయ ముస్లింలు అభిప్రాయపడ్డారు.
ఆరోగ్య కారణాల రీత్యా యోగా చేయడం తప్పేమీ కాదని ఉత్తర ప్రదేశ్కు చెందిన దేవబంద్ మతాచార్యాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యోగా లేదా శారీరక వ్యాయామాలను ఇస్లాం మత గ్రంథాలలో నిషేధం విధించ లేదని దారుల్ ఉలూమ్ మత బోధకుడు ఖారీ ఉస్మాన్ తెలిపారు.
ఆరోగ్యంకోసం చేసుకునే ఇటువంటి వ్యాయామాలను మతానికి ముడిపెట్టడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. కాగా ఇస్లాం మతస్తులు ప్రతిరోజూ ఐదుపూటలా చేసే ప్రార్థనల(నామాజు) లోనే యోగాకు సంబంధించిన ఎన్నో అంశాలు ముడిపడివున్నాయని దీనిని మతంపేరుతో ప్రజలలో అపోహలు పెంచకూడదని, ఆరోగ్యం కోసం చేసే ఏ వ్యాయామమైనాకూడా మంచిదేనని ఆయన అభిప్రాయపడ్డారు.