Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎల్ 2023: ఢిల్లీని మట్టికరిపించిన బెంగళూరు.. 23 పరుగుల తేడాతో విన్

RCB
, శనివారం, 15 ఏప్రియల్ 2023 (23:02 IST)
RCB
ఐపీఎల్ 2023లో భాగంగా శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన 20వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 23 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. దీంతో బెంగళూరు ఆటగాడు మనీష్ పాండే అర్థ సెంచరీ (38 బంతుల్లో 50) వృధా అయ్యింది. 
 
దీంతో డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌ వరుసగా ఐదో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. ఇక బెంగళూరు ఆటగాళ్లలో విరాట్ కోహ్లి ఆకట్టుకునే అర్థశతకం (34 బంతుల్లో 50) సాధించాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 20 ఓవర్లలో 174/6కు పరిమితం చేశారు.
 
సవాలుతో కూడిన స్కోరును ఛేదించిన ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) భీకరమైన ఆరంభాన్ని అందుకుంది. జట్టు పృథ్వీ షా (0), మిచెల్ మార్ష్‌లను 0 పరుగుల వద్ద కోల్పోయింది, మహ్మద్ సిరాజ్ 1 పరుగుల వద్ద యష్ ధుల్‌ను అవుట్ చేశాడు.
 
డేవిడ్ వార్నర్ ప్రారంభంలో బాగా ఆడినా 19 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. అభిషేక్ పోరెల్ కూడా 5 పరుగులకే చౌకగా వెనుదిరిగాడు, ఢిల్లీ 53 పరుగులకే సగం జట్టును కోల్పోయింది.
 
మనీష్ పాండే అద్భుతంగా ఆడాడు.అక్సర్ (14 బంతుల్లో 21)తో కలిసి పరుగుల వేటలో ఢిల్లీ ఆశలను సజీవంగా ఉంచాడు. అయితే, అక్షర్ పాండే కూడా 14వ ఓవర్ వద్ద వెనుదిరగడంతో ఢిల్లీకి షాక్ తప్పలేదు. 
 
అన్రిచ్ (14 బంతుల్లో 23 నాటౌట్), అమన్ ఖాన్ (10 బంతుల్లో 18) తమ వంతు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఢిల్లీ 20 ఓవర్లలో 151/9కి పరిమితమైంది. తద్వారా బెంగళూరు విజేతగా నిలిచింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సహచరులతో కలిసి వుండలేకపోతున్నా.. రిషబ్ పంత్