పిసిసి ఉపాధ్యక్షుడు ఆనం వివేకానందరెడ్డికి ఏదో దెయ్యం పట్టిందనీ, ఆయన సెల్ఫోన్లో ఎప్పుడూ ఆయన డ్రీమ్ గర్ల్ ఫొటో ఉంటుందని, మొబైల్లో ఎటువంటి బొమ్మలు వస్తాయో అందరికి తెలుసని సినీ కళ్యాణ్ విమర్శించారు. ఆయన వికారపు చేష్టలను పరిగణలోకి తీసుకుని ఇలాంటి నాయకులు ఎలా ఉంటారో చెప్పడానికి ‘రంభతో లాలికాడు’ సినిమా తీసే ఆలోచన ఉందని ఆయన అన్నారు.
శుక్రవారం నెల్లూరులోని ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను కొనుగోలు చేసిన స్థలంలో భాగం ఇవ్వలేదన్న కారణంతో ఆ స్థలం వక్ఫ్బోర్డుకు చెందినదంటూ.. వివేకా బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. నెల్లూరు రామ్నగర్లో 2008లో మక్సూద్ ఆలీ అనే వ్యక్తి వద్ద తాను రూ.1.60కోట్లకు స్థలం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆనాటి మేయర్ భానుశ్రీకి 100 అంకణాల స్థలాన్ని తాను నజరానా ఇస్తున్నట్లు ఓ పత్రికలో కథనం వచ్చిందని.. అప్పుడు దీన్ని ఖండించాలని.. ఆ భూమిని తనకివ్వాలని వివేకా ప్రాధేయపడ్డట్లు గుర్తు చేశారు.
ఈ వంద అంకణాల స్థలం ఆయనకు ఇవ్వనందుకే ఈ రోజు అది.. మైనారిటీల స్థలంగా మారిందా..? అని కల్యాణ్ ప్రశ్నించారు. మైనారిటీ వర్గానికి చెందిన చదువుకున్న వ్యక్తి మేయరు పదవిలో ఉంటే ఓర్వలేని వివేకా మైనారిటీలపై మొసలి కన్నీరు కారుస్తున్నాడని విమర్శించారు. వివేకా తనతో పెట్టుకుంటే మసైపోతాడని హెచ్చరించాడు. తాను ఒక్కడినే వస్తానని, ఏ సెంటర్కైనా వస్తానని. ఆయన ఎంత మందినైనా తెచ్చుకోవచ్చనని సవాల్ విసిరారు.