ఇండోనేషియా రాజధానిలోని లగ్జరీ హోటళ్లలో శుక్రవారం బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ బాంబు పేలుళ్లలో తొమ్మిది మంది మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. మారియట్ హోటల్లో మొదటి పేలుడు సంభవించగా, అనంతరం ఐదు నిమిషాలకు రిట్జ్- కార్ల్టన్ హోటల్లో రెండో పేలుడు సంభవించింది.
మారియట్ హోటల్లో సంభవించిన పేలుడుకు హోటల్ ముఖ్య అనుమానితులు అతిథులేనని ఇండోనేషియా పోలీసులు అనుమానిస్తున్నారు. జకార్తాలోని ప్రధాన వ్యాపార ప్రదేశంలో జరిగిన రెండు బాంబు పేలుళ్లను ఆత్మాహుతి దళ సభ్యులు జరిపివుంటారని అనుమానిస్తున్నట్లు ఇండోనేషియా సీనియర్ చట్టసభ్యుడొకరు చెప్పిన కొన్ని నిమిషాలకే ఇండోనేషియా పోలీసులు అతిథులే ఈ బాంబు పేలుళ్లకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే అంతకుముందు ఇండోనేషియా పార్లమెంట్ భద్రతా సంఘం ఛైర్మన్ శామ్బుగా మాట్లాడుతూ.. ఇవి ఆత్మాహుతి దాడులుగా కనిపిస్తున్నాయన్నారు. ఈ కోణంలో దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ఇండోనేషియా అధ్యక్ష ప్రతినిధి ఒకరు ఇవి తీవ్రవాద దాడులను స్థానిక మీడియాతో చెప్పారు. ఇప్పటివరకు ఈ పేలుళ్లకు ఏ తీవ్రవాద గ్రూపు బాధ్యత వహించలేదు.