Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వైన్ ఫ్లూతో భారతీయుని మృతి

Advertiesment
స్వైన్ ఫ్లూ
స్వైన్ ఫ్లూ మహమ్మారి బారిన పడిన 63 సంవత్సరాల భారతీయ పౌరుడు శుక్రవారంనాడు దుబాయ్‌లో మృతి చెందాడు.

స్వైన్ ఫ్లూ బారిన పడిన ఈ వయోవృద్ధుడు భారతదేశానికి చెందిన వాడని దుబాయ్‌లోని ఆరోగ్య మంత్రిత్వశాఖాధికారులు వెల్లడించారు. ఈ వ్యాధిబారిన పడిన తర్వాత చికిత్స తీసుకోవడంలో అలసత్వం వహించాడని అధికారులు తెలిపారు. వ్యాధి ప్రారంభంలోనే ఇతను చికిత్స చేసుకుని ఉంటే మృతి చెందేవాడు కాదని అధికారులు అన్నారు.

ఇదిలావుండగా స్వైన్ ఫ్లూ లక్షణాలు కనపడిన వెంటనే ఆసుపత్రిలో చికిత్స కోసం తరలి వెళ్ళాలని అధికారులు ప్రజలకు సూచించారు.

కాగా దేశంలో స్వైన్ ఫ్లూ వ్యాధిబారిన పడి చనిపోయిన కేసు ఇదే ప్రథమమని ఆసుపత్రి అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇతనిలో హెచ్1ఎన్1 వైరస్‌ ముదిరిపోవడంతో అతనిలో రోగనిరోధక శక్తి తగ్గిపోయిందని ఈ కారణంగానే అతను మృత్యువాత పడ్డాడని అధికారులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu