Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సరిహద్దు వివాదంపై భారత్, చైనా చర్చలు

Advertiesment
చైనా
సరిహద్దు వివాదంపై చర్చలు జరిపేందుకు భారత్, చైనా ప్రత్యేక ప్రతినిధులు మరోసారి సమావేశం కాబోతున్నారు. ఈసారి చర్చలు భారత్‌లోనే జరుగుతాయి. ఆగస్టు 7-8 తేదీల్లో ఇరుదేశాల మధ్య సరిహద్దు వివాదంపై చర్చలు జరుగుతాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఖిన్ గాంగ్ శుక్రవారం వెల్లడించారు.

చైనా కౌన్సిలర్ దాయ్ బింగూ, భారత జాతీయ భద్రత సలహాదారు ఎంకే నారాయణన్ ఈ చర్చల్లో పాల్గొంటారు. సరిహద్దు వివాదంతోపాటు ఈ సందర్భంగా చైనా- భారత్ వ్యూహాత్మక, సహకార భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడంపై కూడా అభిప్రాయాలు పంచుకుంటారు. వీటితో పాటు చర్చల్లో ఇతర అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలు కూడా ప్రస్తావనకు వస్తాయని ఖిన్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu