Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రష్యాలో ఆత్మాహుతి దాడి: 20 మంది మృతి

Advertiesment
రష్యా
రష్యాలోని ఉత్తర కాకసస్ ప్రాంతంలోని ఓ పోలీస్ స్టేషన్‌పై ఆత్మాహుతి ట్రక్కు బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 20 మంది పౌరులు మృతి చెందారు. మరో 100 మంది గాయపడ్డారు. ఉత్తర కాకసస్‌లోని నజ్రాన్‌లో ఇస్లామిక్ మిలిటెంట్లు తరుచుగా ఇటువంటి దాడులకు పాల్పడుతూ ఉంటారు. అయితే మిలిటెంట్ల దాడిలో గడిచిన కొన్నేళ్లలో ఈ స్థాయిలో ప్రాణనష్టం ఎన్నడూ సంభవించలేదు.

పేలుడు పదార్థాలతో నింపిన ట్రక్కుతో ఆత్మాహుతి దళ సభ్యుడు పోలీస్ స్టేషన్‌పై దాడికి తెగబడ్డాడని అధికారిక వర్గాలు తెలిపాయి. సమస్యాత్మక చెచెన్యా, పరిసర ప్రావీన్స్‌ల్లో సుస్థిరత కోసం రష్యా ప్రభుత్వం 1994 నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

చెచెన్యాలో తిరుగుబాటుదారులతో రష్యా సైన్యం రెండుసార్లు యుద్ధాలు కూడా చేసిన సంగతి తెలిసిందే. చెచెన్యా తిరుగుబాటుదారులను రష్యా దాదాపుగా అణిచివేసినప్పటికీ, ఇస్లామికి మిలిటెంట్లు మాత్రం తరుచుగా బాంబు దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఇంగుషెటియా ప్రావీన్స్‌లోని నజ్రాన్ నగరంలో పోలీసు ప్రధాన కార్యాలయంపై ఇస్లామిక్ మిలిటెంట్లు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu